Sunday, 02 August 2026 04:52:36 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ప్రజల చెంతకే పోలీస్ నేరరహిత సమాజమే లక్ష్యంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

2000 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం, 37 వాహనాలు సీజ్

Date : 09 April 2026 09:38 AM Views : 456

వాస్తవ గమ్యం / తెలంగాణ / : ​మంచిర్యాల జిల్లా (కోటపల్లి) నేరాలనిర్మూలనమరియుప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా గురువారం తెల్లవారు జామున కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు నేతృత్వంలో సుమారు 50 మంది పోలీసులతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.​గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలపై దాడులు నిర్వహించిన పోలీసులు, భారీగా నిల్వ ఉంచిన సుమారు 2000 లీటర్ల బెల్లపు పానకాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే 70 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, అక్రమ తయారీ మరియు విక్రయాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.​​గ్రామంలో ఇంటింటినీ తనిఖీ చేసిన పోలీసులు, సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు,5ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​కొత్త వ్యక్తులు లేదా అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని గ్రామస్తులను సూచించారు.మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపద సమయంలో 'డయల్ 100'ను ఆశ్రయించాలని తెలిపారు.నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఈ ఆపరేషన్‌లో చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, రూరల్ సీఐ ఆర్.కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు, రాజశేఖర్, జగదీశ్వర్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :