Sunday, 02 August 2026 04:54:23 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యకు పరిష్కారం చూపాలి..

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతి

Date : 10 July 2026 05:23 PM Views : 221

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాణి: మండలంలోని మంగీ, పంగిడి మధోర గ్రామపంచాయతీల పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్ ,జియో, ఎయిర్‌టెల్ టవర్ల ద్వారా మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాలని కోరుతూ తిర్యాణి సర్పంచ్ యూనియన్ మండల అధ్యక్షుడు తుమ్రం గోపాల్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తుమ్రం గోపాల్ మాట్లాడుతూ.ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు సర్వే ప్రక్రియలో మారుమూల గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో బీఎల్ఓలు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రజలు కూడా నిత్యావసర ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల మంగీ, పంగిడి మధోర ప్రాంతాల్లో వెంటనే మొబైల్ నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :