వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలోని అర్హులైన రేషన్ కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన మూడు నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు తెలిపారు.జిల్లాలో సన్నబియ్యం నిల్వలు తగినంతగా ఉన్నాయని, సర్వర్ సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి పంపిణీ సజావుగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు పంపిణీ కొనసాగుతుందని, కార్డుదారులు తొందరపడకుండా తమకు అనుకూల సమయంలో సంబంధిత రేషన్ దుకాణంలో బియ్యం తీసుకోవాలని సూచించారు.జిల్లాలో ప్రస్తుతం 2,57,251 రేషన్ కార్డులు ఉండగా, అర్హులైన ప్రతి కార్డుదారునికి మూడు నెలల సన్నబియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా లేదా పక్కదారి మళ్లించినా డీలర్ల లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కార్డుదారులపై కూడా రేషన్ కార్డు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం