Friday, 31 July 2026 09:12:04 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

బిజిగిర్ షరీఫ్ దర్గా వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించిన హుజురాబాద్ ఏసీపీ మాధవి

Date : 19 May 2026 08:20 PM Views : 1184

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : స్థానిక బిజిగిర్ షరీఫ్ దర్గాలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల భద్రతకై దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, గ్రామ సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.ఉరుసు ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రక్షణ, భద్రత దృష్ట్యా దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలీసు శాఖ సూచన మేరకు దర్గా కమిటీ సభ్యులు తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో 10 సీసీ కెమెరాలను అమర్చడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించిన దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్‌ను ఏసీపీ శాలువాతో సత్కరించి అభినందించారు.​దర్గా కమిటీ తరఫున అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్. ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్, సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య, వార్డు సభ్యుడు నయీముద్దీన్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్, కమిటీ సభ్యులు సర్వర్, అలీ షరీఫ్, అజ్మత్, రెహాన్, అయాన్ మరియు గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :