వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండలంలోని సర్వే నంబర్ 350 లో ఉన్న ఏజెన్సీ (షెడ్యూల్డ్) భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాల్తో సహా సదరు భూమిని తక్షణమే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు అదనపు ఏజెంట్ తీర్పు వెలువరించారు.గిరిజన భూమిని నాన్-గిరిజనులు ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారని 'ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం' ప్రతినిధులు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గతంలోనే సదరు నాన్-గిరిజనుడిని భూమి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు.ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీలుదారుడు దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నతాధికారులు విచారించారు.గత 70 ఏళ్ల పహాణీ రెవెన్యూ రికార్డుల్లోనూ ఎక్కడా అప్పీలుదారుడి పేరు లేదని, ఏజెన్సీ చట్టం (1/1970 రెగ్యులేషన్) అమలులోకి వచ్చిన తర్వాత నాన్-గిరిజనులు చేసిన కొనుగోళ్లు చెల్లవని స్పష్టం చేశారు. అలాగే మున్సిపాలిటీ అనుమతి లేకుండానే ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు.అప్పీలుదారుడి వాదనల్లో ఎలాంటి ఆధారం లేకపోవడంతో అప్పీల్ను కొట్టివేస్తూ, ఆ భూమిని మరియు నిర్మాణాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని మందమర్రి తహసీల్దార్కు ఉత్తర్వులు జారీ చేశారు.దీనికి జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్ కి సంఘము తరపున సభ్యులు కృతజ్ఞతలు తెలియచేసినారు.....
Admin
వాస్తవ గమ్యం