Friday, 31 July 2026 09:14:35 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే టాపర్స్

మంత్రి వివేక్ వెంకటస్వామి

Date : 27 May 2026 05:20 PM Views : 15580

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, అందుకు నిదర్శనమే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టాపర్లుగా నిలవడమేనని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ​ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ విద్యా రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటును వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశాం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్'ను స్థాపించబోతున్నాం. చెన్నూరు పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు (స్పెషల్ ఫండ్స్) కేటాయించి కార్యాచరణ చేపడుతున్నo. విద్య కోసం ఎన్ని నిధులైనా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం, అధికారులు, ప్రజాప్రతినిధులు నిధుల కోసం నాతో ఫైట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు రోడ్లు, డ్రైనేజీల వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టానని, ఇక నుంచి పూర్తి ఫోకస్ విద్య, వైద్య రంగాల పైనే ఉంటుందని స్పష్టం చేశారు. ​విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవలు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో విద్యా, సామాజిక రంగానికి అందిస్తున్న సేవలను మంత్రి గుర్తుచేశారు. మహిళల కోసం పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మించామని, పాఠశాలల్లో టీచర్ల కొరత తీర్చడం, బెంచీలు ఏర్పాటు చేయడం, తాగునీటి కోసం బోర్ వెల్స్ వేయించడం వంటి పనులు ట్రస్ట్ ద్వారా చేపట్టామని తెలిపారు. అలాగే చెన్నూరులో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్ ద్వారా విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు.విద్య ప్రతి ఒక్కరి హక్కు. అది మనిషికి స్వేచ్ఛను, ఆలోచనా శక్తిని ఇస్తుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. విద్యార్థులంతా క్రమశిక్షణతో చదువుకుని, జీవితంలో ఒక లక్ష్యాన్ని (గోల్) నిర్దేశించుకుని, తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలి. ఈ అభినందన సభలో డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాధరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి (డి ఈ ఓ) యాదయ్య, మండల విద్యాశాఖాధికారి (ఎం ఈ ఓ) రమేష్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: