వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తిలో వెలసిన శ్రీ రామాలయంలో మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ నాగసుబ్రమణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచే ఆలయ అర్చకులు కనగర్తి సందీప్ కుమారా చార్యులు స్వామి వారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు.ఈ విశేష పూజా కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.పూజా అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ గావించారు. మంగళవారం నాటి ఈ పూజల్లో పాల్గొనడం వల్ల జాతక దోషాలు తొలగి, శుభాలు చేకూరుతాయని భక్తులు నమ్మకంతో కొలిచారు.
Admin
వాస్తవ గమ్యం