Saturday, 01 August 2026 01:57:48 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రిలో అదనపు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.

డంపింగ్ యార్డు, మున్సిపల్ కార్యాలయం పరిశీలన

Date : 30 June 2026 07:14 PM Views : 271

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 30 :మంచిర్యాల జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ (లోకల్ బాడీస్) ఈరోజు మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని చత్లాపూర్ గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. డంపింగ్ యార్డు నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈ. వసంత్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఎం. గోపీకృష్ణ అదనపు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.సందర్శన సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2026 మార్గదర్శకాల ప్రకారం తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు , శానిటరీ వ్యర్థాలను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.అనంతరం మందమర్రి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు జిల్లా కలెక్టర్, ఇటీవల అకౌంట్స్ విభాగంలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, కార్యాలయ నిర్వహణను మరింత పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.తదుపరి మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ సేవలు పొందుతున్న ప్రజలతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి పి. కృష్ణ ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ ఈ. రాజేశ్వరి, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: