Sunday, 02 August 2026 07:15:06 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఖానాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై సమగ్ర విచారణ జరపాలి,జిల్లా కలెక్టర్‌కు న్యూ డెమోక్రసీ వినతి

Date : 11 May 2026 06:35 PM Views : 695

వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ పూర్తి చేయాలని, అనర్హులను తొలగించి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ మరియు డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులకు రాతపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల కేటాయింపులు జరిపారని ఆరోపించారు.పేదలకు చెందాల్సిన ఇళ్లను బడా బాబులకు, ఇతర అనర్హులకు కేటాయించి అన్యాయం చేశారని మండిపడ్డారు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, లబ్ధిదారుల నుండి 'సెల్ఫ్ అఫిడవిట్' తీసుకోవాలని, తద్వారా అక్రమంగా ఇళ్లు పొందిన వారిని తొలగించి నిజమైన పేదలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లు వారికే దక్కాలి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది అధికారులు న్యాయం చేయాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం."ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ తోట రాధా, లక్ష్మి, కల్పన, కమల, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: