Saturday, 01 August 2026 03:58:39 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి సిపిఐ (ఏ ఎం)డిమాండ్

జిల్లా అధ్యక్షుడు దూలం శ్రీనివాస్

Date : 10 July 2026 05:43 PM Views : 375

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పోడు సాగుదారులైన ఆదివాసులు, పేదల భూముల్లో అటవీ శాఖ కందకాలు తవ్వడం, భూములు స్వాధీనం చేసుకునే చర్యలను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.రైతులకు యూరియా, డీఏపీ, రైతుబంధు, బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు, పుస్తకాల పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :