Saturday, 01 August 2026 01:32:27 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో సెల్ టవర్ నిర్మాణం ఆపాలి

​విద్యార్థుల ఆరోగ్యంపై రేడియేషన్ ప్రభావం పడే అవకాశం ​- 35 ఏళ్ల నాటి చెట్ల నరికివేతపై పర్యావరణ ప్రేమికుల ఆగ్రహం ​- అధికారులకు విన్నవించిన కోలుగురి విజ

Date : 09 April 2026 02:00 PM Views : 342

వాస్తవ గమ్యం / తెలంగాణ / : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సామాజిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్ కోలుగురి విజయ్ కుమార్ ఈ విషయంపై అధికారులకు విన్నవించారు. పాఠశాల ఆవరణకు అతి సమీపంలో టవర్ నిర్మించడం వల్ల వెలువడే రేడియేషన్ విద్యార్థులపై, ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ​టవర్ నిర్మాణం కోసం సుమారు 35 ఏళ్ల చరిత్ర గల వృక్షాలను ఇప్పటికే నరికివేయడం అత్యంత బాధాకరమని, అత్యంత కాలుష్య భరితమైన మందమర్రిలో ఇలాంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. ​నిత్యం వందలాది మంది వాకర్స్, క్రీడాకారులు వినియోగించుకునే ఈ మైదానంలో టవర్ నిర్మించడం సరికాదని, ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ మరియు సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. జనావాసాలు లేని ప్రాంతానికి ఈ టవర్‌ను తరలించి, పాఠశాల విద్యార్థులను, పర్యావరణాన్ని కాపాడాలని రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల మిత్రులు మరియు తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :