Friday, 31 July 2026 11:28:40 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రి టోల్ గేట్ సమీపంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన అదాని సంస్థ

Date : 24 June 2026 05:46 PM Views : 174

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి జూన్ 24 అదాని కంపెనీ ఆధ్వర్యంలో టోల్ గేట్ సమీపంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరంలోమందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ రాజలింగు మొక్కలు నాటి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన, "రక్తదానం మహాదానం" అని పేర్కొంటూ, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ సునీల్ వానిస్, ఎన్‌హెచ్‌ఏఐ డిప్యూటీ మేనేజర్ సౌరబ్ రంజన్, రెసిడెంట్ ఇంజనీర్ మహేష్, హార్టికల్చర్ నిపుణులు తిరుపతి, అదాని సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :