వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి ఆర్కే5 సీహెచ్పీ వరకు గల ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలు, చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగి రోడ్డుపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక నిత్యం చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయని, రాత్రి వేళల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతేకానీ అధికారులు స్పందించరా అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన ముళ్ల పొదలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
వాస్తవ గమ్యం