Saturday, 01 August 2026 01:34:00 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి

కలెక్టరేట్ వద్ద భారత రాష్ట్ర విద్యార్థి విభాగం వినతి పాత్రం

Date : 27 April 2026 01:47 PM Views : 194

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్రంలో గత రెండేళ్లుగా నిలిచిపోయిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, అలాగే భారత రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర విద్యార్థి విభాగం కలెక్టరేట్ ఏ ఓ ని కలిసి వినతి పత్రం అందజేశారు.గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.నిధులు రాకపోవడం వల్ల వేలమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు ఇబ్బంది పడుతున్నారని, కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి భారత రాష్ట్ర విద్యార్థి విభాగం, కార్యకర్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :