Friday, 31 July 2026 11:25:17 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రి ఎంపీడీవో ఆఫీస్ ముందు మద్యం సీసాలు

Date : 06 July 2026 04:11 PM Views : 86

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం వందలాది మంది వచ్చే ప్రభుత్వ కార్యాలయం ఎదుటే మద్యం సేవించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం మందమర్రి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణం ముందు మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు కనిపించడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం, రాత్రి వేళల్లో కొందరు మందుబాబులు ఎంపీడీవో కార్యాలయం పరిసరాలను అడ్డాగా మార్చుకుని బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యం సేవించిన అనంతరం ఖాళీ సీసాలు, వ్యర్థాలను అక్కడే వదిలివెళ్లడంతో ప్రభుత్వ కార్యాలయ పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటోందని, కార్యాలయానికి వచ్చే మహిళలు, వృద్ధులు, ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కార్యాలయ పరిసరాల్లో భద్రత, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు కోరుతున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :