Friday, 31 July 2026 11:25:48 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​మందమర్రి మున్సిపాలిటీలో ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి

Date : 11 April 2026 04:30 PM Views : 118

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ నేపథ్యంలో జ్యోతిబా ఫూలే 1827, ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. థామస్ పైన్ రాసిన “ది రైట్స్ ఆఫ్ మ్యాన్” గ్రంథం ఆయనలో సామాజిక చైతన్యాన్ని నింపింది. ​స్త్రీ విద్యకు ప్రాధాన్యత: సమాజంలో అవిద్య, కుల వివక్ష వల్ల స్త్రీలు వెనుకబడి ఉన్నారని గుర్తించిన ఆయన, వారి విద్యాభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని నమ్మి, బడుగు బలహీన వర్గాల కోసం పాఠశాలలను స్థాపించారు. అణగారిన వర్గాల హక్కులు, రైతుల సమస్యల కోసం నిరంతరం పోరాడారు.సామాజిక సేవకు గుర్తింపుగా 1888లో ఆయనకు “మహాత్మా” బిరుదు ప్రదానం చేశారు. ఆయన ఆలోచనలే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి స్ఫూర్తిగా నిలిచాయి.ఫూలే ఆశయాలను ఆచరించడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి." అని — తుంగపిండి రాజలింగు, మున్సిపల్ కమిషనర్ అన్నారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఫూలే సేవలను స్మరించుకున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :