Saturday, 01 August 2026 01:58:32 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సీఐటీయు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురు నేతల బహిష్కరణ

Date : 24 June 2026 07:58 PM Views : 146

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ, జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు సంకె రవి, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, కాసిపేట రాజేశం, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు గట్టు మహేందర్ ఇటీవల మరో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి, అందులో కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు పత్రికల ద్వారా తెలిసిందన్నారు.ఇది సీఐటీయు నిబంధనలు, పని విధానాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్న వారు, సీఐటీయు జిల్లా కమిటీ నిర్ణయం మేరకు ఈ ఐదుగురిని సంస్థ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. ఇకపై వారికి సీఐటీయుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఐటీయు కార్మికులు, అనుబంధ యూనియన్లు, జిల్లాలోని కార్మిక సంఘాలు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు గమనించాలని వారు కోరారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సమ్మక్క, జిల్లా సహాయ కార్యదర్శులు వెంకటస్వామి, భానుమతి, జిల్లా కమిటీ సభ్యులు జి. ప్రకాష్, సి. దేవదాసు, ఎ. లక్ష్మణ్, ఎ. మౌలాలి, డి. రాజారాం తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :