Friday, 31 July 2026 09:11:24 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు

అదనపు కలెక్టర్ వి. రాములు

Date : 23 July 2026 07:04 PM Views : 25

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను తక్షణమే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు రైస్ మిల్లుల యాజమాన్యాలకు ఆదేశించారు.గురువారం జన్నారం మండలం పొనకల్ గ్రామంలోని శ్రీ శివసాయి రాఘవేంద్ర రైస్ మిల్లు, మర్రిగూడలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు, దండేపల్లి మండలం లింగాపూర్‌లోని శ్రీ కృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, పెద్దపేటలోని భవాని ఇండస్ట్రీస్, కన్నెపల్లిలోని వెంకటేశ్వర పీబీఆర్‌ఎం, రాధాకృష్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను తహసీల్దార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సీఎంఆర్ పెండింగ్‌పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా 2025–26 వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం పురోగతిని సమీక్షించిన అదనపు కలెక్టర్, గడువులోగా సీఎంఆర్‌ను పూర్తి చేయని రైస్ మిల్లుల నుంచి ధాన్యాన్ని మెరుగైన పనితీరు కనబరిచే ఇతర మిల్లులకు తరలించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జన్నారం, దండేపల్లి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించి, 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జన్నారం, దండేపల్లి మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :