Saturday, 01 August 2026 01:32:43 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రి సింగరేణి హైస్కూల్‌లో ఘనంగా యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

Date : 25 June 2026 06:04 PM Views : 563

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 25: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ హైస్కూల్ (కళ్యాణిఖని)లో గురువారం 'ఈగల్ ఫోర్స్ తెలంగాణ' పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ సరఫరా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా యాంటీ డ్రగ్ హెల్ప్‌లైన్ 1908కు తెలియజేయాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బందితో కలిసి అధికారులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించే అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, అలాగే సింగరేణి, కార్మల్, లిటిల్ ఫ్లవర్, శ్రీచైతన్య, కృష్ణవేణి, మాంటెస్సోరి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: