Saturday, 01 August 2026 11:48:43 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి

Date : 28 July 2026 05:19 PM Views : 178

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లోని డిస్పెన్సరీ ని మంగళవారం సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ నేపథ్యంలో డిస్పెన్సరి లో సింగరేణి ఉద్యోగులకు మరియు కార్మికులకు అందిస్తున్న వైద్య విధానాలు,వైద్య. సదుపాయాలు, మందులు,పరీక్షల గురించి అక్కడి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సింగరేణి ఎస్టిపిపి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ప్రభావిత గ్రామాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల పట్ల సంతృప్తి గా ఉందని,ప్లాంట్ ప్రభావిత గ్రామాల ప్రజలు ఈ ఉచిత సేవలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బంది అన్ని వేళలా రోగులకు అందుబాటులో ఉండాలని,అత్యవసర పరిస్థితులలో అవసరమగు మందులను, సామాగ్రిలను అందుబాటులో ఉండేలా తప్పకుండా చూసుకోవాలని ఆదేశించారు.డిస్పెన్సరిలో సింగరేణి ఉద్యోగులకు,కాంట్రాక్టు కార్మికులకు నిర్ణిత సమయానికి చేసే పీరియడికాల్ మెడికల్ ఎక్షామినేషన్ వంటి వైద్య పరిక్షలకు ఇతర ఏరియా హాస్పిటల్స్ కు వెళ్ళకుండా ఇక్కడనే అన్ని వైద్య పరిక్షలు నిర్వహించేలా చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట డిస్పెన్సరి మెడికల్ సూపరింటెండెంట్ డా.జానకి,సీనియర్ స్టాఫ్ నర్స్ రాజమణి,వార్డ్ అసిస్టెంట్ లు రాజు,తిరుపతి,ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

GAJULA SADANANDAM

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :