Saturday, 01 August 2026 03:44:55 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

గోదావరిపై వంతెన కోసం పోరుబాట

మంచిర్యాలలో బీజేపీ భారీ ధర్నా

Date : 13 April 2026 04:48 PM Views : 104

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది.గతంలో మంజూరైన వంతెనను రద్దు చేయడంపై మంచిర్యాల అంతర్గాం ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ రవాణా కష్టాలు తీరాలంటే వంతెన నిర్మాణం ఒక్కటే మార్గమని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం హోరెత్తింది.మంచిర్యాల అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం11గంటలకు ఐబీ చౌరస్తా వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహించింది.ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,చెన్నూర్ నియోజకవర్గ నాయకులు దుర్గం అశోక్ నాయకత్వం వహించారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాలను కలిపే ఈ వంతెన నిర్మాణం ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.​గతంలోనే ఈవంతెన మంజూరైనప్పటికీ, ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం వల్ల వేలాది మంది ప్రజలు, విద్యార్థులు,రోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.వంతెన లేకపోవడం వల్ల కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించాలని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో కోటపెల్లి మండలం నుండి మంత్రి రామయ్య, గుర్రం నారాయణతో పాటు వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వంతెన నిర్మాణం చేపట్టాలి రవాణా కష్టాలు తీర్చాలి అంటూ చేసిన నినాదాలతో మంచిర్యాల మార్మోగింది.ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.ఈ ధర్నాకు ప్రజల నుండి కూడా విశేష మద్దతు లభించింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :