Sunday, 02 August 2026 04:57:51 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

హరి హర దేవస్థానంలో ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు

Date : 05 May 2026 09:10 PM Views : 344

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి స్థానిక హరి హర దేవస్థానంలో సంకష్టహర చతుర్థి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళకరుడైన గణపతిని ఆరాధిస్తూ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం నుంచే గణనాథుడికి శాస్త్రోక్త పూజలు నిర్వహించి సాయంత్రం గణపతి హోమం పంచామృత అభిషేకాలు, షోడశోపచార పూజలు నిర్వహించారు.స్వామివారిని గరిక, మందార పూలతో సుందరంగా అలంకరించారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో "సంకట నాశన గణేశ స్తోత్రం" పఠనం భక్తులను పరవశింపజేసింది. విఘ్నేశ్వరుడికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు.లోక కళ్యాణార్థం మరియు భక్తుల విఘ్నాలు తొలగాలని గణపతి హోమం నిర్వహించారు. వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం చంద్రోదయ సమయంలో ప్రత్యేక హారతి ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.సంకష్టహర చతుర్థి కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తమ కోరికలు నెరవేరాలని, సకల కష్టాలు తొలగిపోవాలని భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: