Saturday, 01 August 2026 11:48:43 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం

Date : 29 July 2026 06:29 PM Views : 243

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ బుధవారం వివిధ డివిజన్లలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉప్పొంగుతున్న నాళాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.39వ డివిజన్ బృందావన్ కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన చెత్తాచెదారం, పైపులను జేసీబీ సాయంతో తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు. అధిక వర్షపాతం దృష్ట్యా అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని మేయర్ ఆదేశించారు.నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వర్షాల ప్రభావంతో అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.అలాగే, అవసరం లేని సమయంలో ఉప్పొంగుతున్న నాళాలు, వాగులు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని మేయర్ దర్ని మధుకర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :