వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : మందమర్రి మున్సిపాలిటీలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించి, త్వరితగతిన ఎన్నికలు జరిపించాలని కోరుతూ శనివారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని పలువురు నాయకులు కలిశారు.ఈరోజు హైదరాబాద్లోని కేంద్ర మంత్రి నివాసంలో అందుగుల శ్రీనివాస్,పుస్కూరి పవన్ రావు, మాయ రమేష్ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలకు మెరుగైన ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన అందాలంటే త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి.నాయకుల వినతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, త్వరలోనే ఎన్నికలు జరిగేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
Admin
వాస్తవ గమ్యం