Sunday, 02 August 2026 05:04:44 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రి పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

Date : 24 June 2026 07:26 PM Views : 120

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 24: మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వైద్య, విద్య, మున్సిపల్, ఐసీడీఎస్ తదితర శాఖల సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించామని, పోలియో వ్యాక్సిన్‌ను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో సుమారు 76,367 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 459 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా సుమారు 1,836 మంది వైద్య సిబ్బందితో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని ఐదేళ్లలోపు పిల్లల వివరాలను సేకరించి, మొదటి రోజే 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. మిగిలిపోయిన పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. అప్పుడే పుట్టిన పిల్లలు, గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న పిల్లలు కూడా పోలియో చుక్కలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అసంక్రమణ వ్యాధుల నిర్వహణ, ఔషధ నిల్వలను పరిశీలించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. గడువు ముగిసిన మందులను ప్రత్యేకంగా వేరు చేసి భద్రపరచాలని సూచించారు.అలాగే బీపీ, షుగర్ వంటి అసంక్రమణ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని, సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఆశా ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పర్యవేక్షకులు, క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో పాల్గొంటున్న సిబ్బంది పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: